boath: బోథ్‌లో రేవంత్‌రెడ్డి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయ‌కులు

సిరాన్యూస్, బోథ్‌
బోథ్‌లో రేవంత్‌రెడ్డి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయ‌కులు

సీఎం రేవంత్‌రెడ్డి జూలై 1 నుండి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ బస్టాండ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, సహకార సంఘం డైరెక్టర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి రాజుయాదవ్ లు మాట్లాడుతూ రైతులను రుణ విముక్తులను చేయాలన్న ఉద్దేశంతో రుణమాఫీ కోసం చర్యలు జులై ఒకటి నుండి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించి కొంతమంది రుణమాఫీ చేసి ఎంతోమంది రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. రైతును రాజుగా ప్రభుత్వం సంకల్పించింది అన్నారు. రైతులు సైతం ఏకకాలంలో రుణమాఫీకి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రైతు భరోసా సైతం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ ఉమేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు భోజన్,న గడ్డల నారాయణ పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *