సిరాన్యూస్, ఓదెల
చొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్
చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపా దేవి ఇటీవల మృతి చెందారు. మంగళవారం కరీంనగర్ జిల్లా ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్ బాధిత ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే ను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ ఉన్నారు.