సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ సాధించుకున్న తర్వాత హైదరాబాద్ భూములను బంగారు బాతులా మార్చేశారు బీఆర్ఎస్ పెద్దలు. అందుకు మొదట లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియల్ వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. ఈ మూడింటిని తమకు అనుకూలంగా కట్టేసిన బీఆర్ఎస్ పార్టీ, లెజిస్లేచర్తో ఎమ్మెల్యేలను కొనుగొలు చేసింది. పార్టీలను వీలీనం చేసుకుంది. ఎగ్జిక్యూటివ్కు సంబంధించి బిహార్ బ్యాచ్ని నమ్మేసి ఇష్టానుసారంగా వారికి దగ్గరగా ఉండే నాయకులకు భూములు దొచిపెట్టింది. అందరినీ కాపాడుతుందని అశించే న్యాయ వ్యవస్థను కూడా నాశనం చేసింది. లాభాలు ఆర్జించేలా ఉండే నిర్ణయాలకే ప్రయారిటీ ఇచ్చింది. ఆర్టీసీ సమ్మెలో, ధర్నా చౌక్ అంశాల్లో ఎలా అయితే వాదించారో, అలానే భూ కుంభకోణాల్లో వారు చెప్పిందే వేదం. వారి లీగల్ ఓపినియన్ ఏది అంటే అదే. రెవెన్యూ అధికారులను వేధించి పాత ఫైల్స్తో వారికి సొంత లాభం జరిగేలా, వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారు. ఆ భూముల విలువ ఈరోజు లక్షల కోట్లకు చేరిపోయాయి. బీఆర్ఎస్ పార్టీకి బినామీగా ఉండే ఫినిక్స్ లాంటి కంపెనీలకు ఈజీగా అన్నీ ఇచ్చేశారు. వారి సొంత పనుల కోసం వందల ఎకరాలను లిటిగేషన్లోకి నెట్టారు. నగర శివార్లలో ఉండే భూములపై కన్నేసి, 40 ఏండ్ల క్రితం రికార్డ్స్ని తెప్పించి డబ్బులు దండుకున్నారు. మాజీ అడ్వకేట్ జనరల్ అధికారులపై ఫైళ్లు విసిరి తమకు నచ్చినట్టు దందా సాగించారు. బాచుపల్లి వ్యవహారమే ఇందుకు నిదర్శనం.ఏపీ ల్యాండ్ రీఫామ్స్ (సీలింగ్) యాక్ట్ ప్రకారం బాచుపల్లిలోని సర్వే నెంబర్ 41, 83, 132, 133, 135, 136, 330, 335, 336లో 116 ఎకరాలతో పాటు మధునపల్లిలోని సర్వే నెంబర్ 187/1, 187/2,252/2,248/6 మరియు పెద్దగొన్నూరులో మరో ఐదు సర్వే నెంబర్స్తో కలిసి సీసీ నెంబర్ 702/ఎం/75తో 1976లో సిలింగ్పై ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై అప్పిలెంట్ ట్రైబ్యునల్ ఎల్ఆర్ నెం.382/1977 హైదరాబాద్లో 4-8-1977లో ఆర్డర్ ఇచ్చారు. ఇందులో బాచుపల్లికి చెందిన రెండు సర్వే నెంబర్స్ 15, 511 లోని 27 ఎకరాలు ఎక్కువ చూపిస్తూ, అప్పీల్కి వెళ్లారు. అందుకు సీఆర్పీ నెంబర్ 3266/1977 వేశారు. దీనిపై తీర్పు 21-03-1978లో ఎక్కడెక్కడ, ఎంతెంత భూమి ఉందో క్లియర్గా ఫ్యామిలీ నెంబర్స్తో పాటు ఇచ్చేసింది. హిందూ ఫ్యామిలీ యాక్ట్ ప్రకారం మైనర్స్కి వచ్చే రూల్స్ ప్రకారం పంచేశారు. ఇవన్నీ 40 ఏండ్ల క్రితం టైటిల్పై ముగిసిన అద్యాయం. ఆ రోజుల్లో ఈ భూములను ఫ్రీగా ఇస్తామన్నా తీసుకోలేని పరిస్థితి. ల్యాండ్ రీఫార్మ్స్లో ఏం జరుగుతుందోననే భయంతో సాగు చేసుకున్న వారు కూడా వదిలేసి వెళ్లిపోయారు. ఏళ్లు గడిచాయి. తెలంగాణ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు భూముల లిటిగేషన్స్ కోసం జోరుగా వెతుకుతున్న సమయంలో లీగల్గా హైకోర్టులో సీఆర్పీ నెంబర్ 3266/1977 కనిపించింది. మైనర్స్గా ఉన్న వారి పరిస్థితితో పాటు అనేక లీగల్ ఇష్యూస్ ఉన్న 116 ఎకరాల భూమి బాచుపల్లిలో బంగారు బాతులా అనిపించింది. ఇంకేముంది, పంట పండింది అనుకున్న అప్పటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ 2016లో చక్రం తిప్పారు. ల్యాండ్ రిఫార్మ్స్ తీర్పు ఇచ్చే ఆనాటి ఆర్డీవోతో ఓ తీర్పు ఇప్పించుకున్నారు. 1983లో చనిపోయిన వ్యక్తి కుటుంబం ముందుకు వచ్చింది. యూఎల్సీ కేసు నెంబర్ జీ1/216/82 లో క్లియర్గా 4 లక్షల 51 వేల 236 స్క్వేర్ మీటర్స్పై అప్పీల్స్కి వెళ్లారు. దీనిపైన యూఎల్సీ/74/89, 20-01-1989లో తీర్పు వచ్చింది. వీటన్నింటిని కలుపుకుని 10-05-2016లో విచారణ జరిపి అనాటి ఆర్డీవో నోటీసులు ఇచ్చారుతెలంగాణలో భూమి ఖాళీగా ఉంటే చాలు బిల్డింగులు కట్టేస్తారు. అదే క్రమంలో 30 ఏండ్లుగా రెవెన్యూ రికార్డులు, సబ్ రిజిస్ట్రార్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఉన్నారు. అయితే, ఓ అడుగు ముందుకేసి కొందరు, నగర శివార్లుగా పిలిచే బాచుపల్లి, బహుదూర్పుర, బౌరంపేట్, హాఫీజ్ పేట్, శేరిలింగంపల్లి, మాదాపూర్లో ఎప్పటి నుంచో కన్నేసి వేల కోట్లు సంపాదించారు. అలానే, అక్కడి భూములను పలువురికి అమ్మేశారు. ఆ భూములను తర్వాత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో నెల జీతం కోసం పనిచేసేవారు కొనుగోలు చేశారు. అలా 116 ఎకరాల్లో 16 ఎకరాలు కూడా ఖాళీగా లేవు. కానీ, మూడు ప్రధానమైన వ్యవస్థలను దగ్గరపెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు సెటిల్మెంట్స్ చేశారు. మీ భూమిలోకి మేము వస్తాం అంటూ కొందరితో అగ్రిమెంట్లు చేయించి బెదిరించారు. దీంతో పొజిషన్లో ఎకరాల కొద్దీ ఉన్న కంపెనీలు, ఆనాటి కొనుగోలు దారులు కోట్లాది రూపాయలు చెల్లించారు. అదే అదునుగా అదనంగా రాసుకున్న 27 ఎకరాల్లో దందాలు కొనసాగించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.మూడు చేతులు మారిన తర్వాత 2006లో ఆనాటి కూకట్పల్లి భూస్వాములు 10 ఎకరాలు కొనుగోలు చేశారు. డాక్యుమెంట్ నెంబర్స్ 22544, 22070, 21746, 20199/2006లో కొనుగోలు చేశారు. వీరంతా మర్రిపల్లి కుటుంబంలోని కొందరి నుంచి తీసుకున్నారు. మరికొంత మంది మర్రిపల్లి కుటుంబానికి చెందిన వారు ఇప్పటికీ 14 ఎకరాల్లో పొజిషన్లో ఉన్నారు. అలాగే, అవినాష్ కుటుంబం 8 ఎకరాల్లో పొజిషన్లో ఉంది. మిగతా 16 ఎకరాల్లో మిగిలినవారు ఉన్నారు. ఆనాడు పట్టాదారులపై ఈనాటికి ధరణిలో భూమి ఉంది. ఖాళీ ప్రదేశం కూడా కనిపిస్తోంది. కానీ, రెడ్డి ల్యాబ్స్ని బెదిరించినట్లే, అన్ని సర్వే నెంబర్స్ని బెదిరించి క్యాష్ చేసుకునే పనిని లీగల్ బ్యాచ్ స్టార్ట్ చేసింది. చౌరస్తాలో ఉన్న అదనపు 27 ఎకరాల భూమిని లిటిగేషన్లోకి నెట్టారు. రోడ్లు అన్నీ తీసివేయగా 24 ఎకరాలకు 40 ఏండ్ల రెవెన్యూ రికార్డ్స్కి అందరూ సమానంగానే ఉన్నారు. కానీ, జ్యుడీషియల్ దందా చేసే మాజీ అడ్వకేట్ జనరల్ లాంటి వారు రేట్లు పెరిగాయి, డెవలప్మెంట్స్కి ఇస్తే ఎంత ఇస్తావు అంటూ బేరాలు ఆడారు. 1977 రికార్డ్స్, ఫేక్ డాక్యుమెంట్స్తో వందల కోట్లు సంపాదించాలనే ఆశతో ప్రైవేట్ భూములపై పడి, ప్రభుత్వ ప్రతినిధులుగా చలమణీ అయ్యారు. అందుకే, 116 తో పాటు 27 ఎకరాల అదనపు చౌరస్తా గొడవ ఇంకా లీగల్గా ఉందని చెబుతున్నారు. మొత్తం 143 ఎకరాలు అంటూ చౌరస్తా భూములను ఎంచుకొని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. మీరు పర్మిషన్ కోసం అప్లై చేస్తే మేము అడ్డుకుంటాం, మాకు ఏమిస్తారు, ఇస్తారా చస్తారా అంటూ టైటిల్ దారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇదంతా, 2018 నుంచి ఇప్పటికీ నడుస్తున్న దందా. కూకట్ పల్లి భూస్వామి నుంచి మొదలుకొని మర్రిపల్లి కుటుంబ సభ్యులను మాజీ అడ్వకేట్ జనరల్ బ్లాక్ మెయిల్ చేశారు. ఇలా లీగల్ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలతో ఒకప్పుడు సొంత కారు, ఇల్లు లేని ఆయన, ఇప్పుడు 5 వేల కోట్ల ఆస్తులను సంపాదించారని తెలుస్తోంది. ఆయన బినామీలు ఎంతటి ‘సంతోషం’గా ఉన్నారో, లెక్కలన్నీ బయటకు తీస్తే అంతా విచారమే