పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం గేట్ ముందు ధర్నా
 సిరా న్యూస్,రంగారెడ్డి కలెక్టరేట్:
మధ్యాహ్న భోజన పథక న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలంటూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న డిమాండ్ చేశారు. రంగా రెడ్డి కొంగరకలాన్ లోని జిల్లా
కలెక్టరేట్ కార్యాలయం ముందు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు, జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ కార్యాలయం లోపలికి గేట్ నుండి ఎవరు వెళ్లకుండా అడ్డంగా బెటాయించారు. కాసేపు ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ సంధర్భంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు పది వేలు నెల జీతం ఇస్తామని ఎన్నికల ముందు హామీ
ఇచ్చారని వెంటనే అమలుచేయలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు సరియగు వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మధ్యాహ్న భోజనం అక్షయ పాత్ర ఫౌండేషన్ కు ఇవ్వడాన్ని విరమించుకోవలన్నారు. కార్మికులకు ఈఎస్ ఐ, పీఎఫ్ అమలుచేయలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డుకు సరిపడు బడ్జెట్ ఇవ్వాలన్నారు. ధరలకు అనుగుణంగా బిల్లులివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటీయూ, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *