నందమూరి నగర్ లో కుళాయిలకు కలుషితమైన నీరు .

పట్టించుకోని మున్సిపల్ అధికారులు.

 సిరా న్యూస్,నంద్యాల ;
నంద్యాల పట్టణ శివారు ప్రాంతమైన నందమూరి నగర్ లో మంచినీటి కుళాయిలకు కలుషితమైన నీరు వస్తుంటే ఏమాత్రం పట్టించుకోని మున్సిపల్ అధికారులని సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు
అనంతరం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు కలుషితమైన నీరు త్రాగి డయేరియా (అతిసారా వ్యాధి) తో బాధపడుతున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని పాలకులు చెబుతున్న క్రింది స్థాయి అధికారులు ఏమాత్రం ప్రజల ఆరోగ్యాల ప్రాణాలపై కొంచెం కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని అన్నారు
నందమూరి నగర్ లో నాలుగైదు రోజులకు ఒకసారి అక్కడ పైపు లీక్ అయింది ఇక్కడ పైపు లీక్ అయింది అని మునిసిపల్ అధికారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు
ఇక్కడ చూడండి ఈ కుళాయికి ఎటువంటి నీరు వస్తుందో గత్యంతరం లేక అక్కడివారు ఆ నీరు తాగితే అతిచార వ్యాధితో ప్రాణాలు కోల్పోవడానికి మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు కారణమవుతారని అన్నారు
ఇప్పటికైనా నందమూరి నగర్ లో మునిసిపల్ అధికారులు అన్ని మంచినీటి పైపులను పరిశీలించి ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయి అక్కడ తూతూ మంత్రం గా కాకుండా శాశ్వత పరిష్కారంలో భాగంగా లీకేజీలకు మరమ్మతులు చేసి ఆ ప్రాంత వాసులకు మంచినీటిని సరఫరా చేసి అక్కడి ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా చూడాలని అన్నారు
==============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *