విద్య,మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేయాలి

 సిరా న్యూస్,తుగ్గలి;
పేద విద్యార్థుల కు మెరుగైన విద్యను,పాఠశాలలలో మౌలిక వసతుల అభివృద్ధికి జియో మైసూర్ సంస్థ వారు సహకరించాలని టిడిపి నాయకులు బాలన్న,లక్ష్మణ స్వామి,రవి యాదవ్,సర్పంచ్ ఓబులేష్, సంఘాల కృష్ణ లు కోరారు.మంగళవారం మండల పరిధిలోని జొన్నగిరి గ్రామ శివారులో గల జియో మైసూర్ క్యాంపు కార్యాలయం కు వెళ్లి ఆ సంస్థ ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి కు జొన్నగిరి ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధికి కృషి చేయాలని వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు కొరత ఉండటం వల్ల పాఠశాలలకు సంబంధించి విద్యా వాలంటరీలను ఏర్పాటు చేయాలని, అలాగే విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.ఈ విషయం పై స్పందించిన జియో మైసూర్ సంస్థ వారు మాట్లాడుతూ జియో మైసూర్ సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధులతో చర్చించి పాఠశాలలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు హోటల్ మళ్లి, జయరాముడు,రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *