సిరాన్యూస్, ఆదిలాబాద్
అయ్యప్పస్వామి వారిని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్
ఆదిలాబాద్ పట్టణంలోని బెల్లురి అయ్యప్పస్వామి ఆలయంలోబోథ్ శాసన సభ్యులు అనిల్ జాధవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన సంతోష్ పద్మవివాహ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలోబోథ్ శాసన సభ్యులు అనిల్ జాధవ్ పాల్గొన్నారు. సంతోష్ పద్మలకు శాలువతో సన్మానించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి ఆలయ సభ్యులు శాలువాతో సన్మానించారు. వీరి వెంట నాయకులు మహేందర్, ప్రీతం రెడ్డి, దేవేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, తిరుమల్ గౌడ్, పాండురంగ్, శేఖర్లతో తదితరులు ఉన్నారు.