సిరా న్యూస్,సికింద్రాబాద్;
సికింద్రాబాద్.. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉస్మాన్ అనే యువకుడు దారుణ హత్య కు గురయ్యాడు. పాటిగడ్డ ఫుట్పాత్ పై అర్థరాత్రి సమయంలో బేగంపేట్ పాత పాటిగడ్డ కు చెందిన ఫిరోజ్, ఐజాజ్, సాహిల్, రెహాన్ (మొత్తం నలుగురు) విచక్షణ రహితంగా కత్తులతో దాడి కి పాల్పడి గొంతు కోసి హత్య చేశారు.
ప్రేమ వ్యవహారమే హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు.ఐజాజ్ మరదలు నేహా ను ఉస్మాన్ ప్రేమిస్తున్నాడని కోపంతో స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న బేగంపేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. .. ఫిరోజ్, ఐజాజ్ లను అదుపులోకి తీసుకోగా..మరో ఇద్దరు పరారీ లో ఉన్నారు.
=====