సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ లో ఈడీ దాడులు మరోసారి కలకలం రేపాయి. తాజాగా హోం చారిటీ గ్రూప్పై 11 చోట్ల ఈడీ సోదాలు బుధవారం నిర్వహించింది. విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్లు, రూ.300 కోట్ల విరాళాలు సేకరించినట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో ఈ సోదాలు నిర్వహించారు. 16 దేశాల్లోని పిల్లలకు ఆహారం, విద్య అందిస్తామని నిధుల సేకరణ చేసినట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలోనూ ఈడీ సోదాలు జరిగాయి.