తాళ్లూరు లిఫ్ట్ ను పరిశీలిచిన ఎమ్మెల్యే

సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరులోని పు ష్కర కాల్వకు అను సంధానంగా ఉన్న తాళ్లూరు లిఫ్టు ను ఇరిగేషన్ అధికారులు, వై జగదీష్, సిహెచ్ రామ లక్ష్మి పుష్కర నిర్మాణంలో భాగస్వామ్యులైన మెగా కంపెనీ ప్రతినిధి పి ఎం మురళి రైతులతో కలిసి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నె హ్రూ పరిశీలించా రు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తాళ్లూరు లిఫ్ట్ అద్వా నంగా తయారవ్వడానికి కారణం గత ప్రభుత్వాన్ని అని గత కొన్ని సంవత్స రాలుగా దానిపై హెచ్చరికలు జారీ చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని దీనిపై ఎమ్మెల్యేగా పరిశీలించడానికి వచ్చానని తెలియజేశా రు. ప్రస్తుతం ఉన్న సిఎస్ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపులు వేసి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడా నికి 49 కోట్లు అవసరం అవుతాయని కానీ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడడం నిధులు సమకూర్చడానికి ఇంకా టైం ఉండటంతో సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిధులు సమకూర్చు కుని పని పూర్తి చేస్తానని అప్పటివరకు రైతులు తమ బోర్లు, చెరువు లు వర్షాధారం మీద పండించుకునే రైతులు తప్ప పుష్కర లిఫ్ట్ పై ఆధారపడి పంటలు వేసుకునే వారు దీనిపై ఆధారపడవద్దని తెలియ జేశారు.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *