సిరా న్యూస్,తిరుపతి;
టాస్క్ ఫోర్సు కార్యాలయానికి తిరుపతి ఎస్పీ, టాస్క్ ఫోర్స్ ఇన్చార్జిగా ఇటీవల చార్జి తీసుకున్న వీ.హర్షవర్ధన్ రాజు బుధవారం సందర్శించారు. ఆయనకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి.శ్రీనివాస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి కార్యాలయంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అడవుల్లో చేపడుతున్న కూంబింగ్, సమాచార వ్యవస్థ గురించి ఎస్పీ శ్రీనివాస్ ఆయనకు వివరించారు. ఇంకా టాస్క్ ఫోర్సులో అటవీ అధికారుల పనితీరు గురించి తెలుసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ల పనితీరు గురించి అధికారులు వివరించగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు గంట పాటు ఆయన టాస్క్ ఫోర్సు అధికారులతో సమావేశమయ్యారు. తరువాత ఆయన మాట్లాడుతూ టీమ్ లు ఆపరేషన్లపై ప్రత్యేక శ్రద్ద తీసుకొవాలని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా ఉండేలా స్మగ్లర్లను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫీల్డ్ ఆపరేషన్లలో అటవీ శాఖా సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు వీలుగా ఆపరేషన్లు చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో తిరుపతి కార్యాలయంతో పాటు, కడప, రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇంకా టాస్క్ ఫోర్సు డీఎస్పీ చెంచుబాబు, ఏసీఎఫ్ శ్రీనివాస్, ఆర్ఐలు సురేష్ కుమార్ రెడ్డి, కృపానంద, చిరంజీవులు పాల్గొన్నారు.
==========================