SI Saibabu: మాదకద్రవ్యాలను కలిసికట్టుగా నిర్మూలిద్దాం:  ఎస్సై సాయిబాబు

సిరాన్యూస్‌,భీమాదేవరపల్లి
మాదకద్రవ్యాలను కలిసికట్టుగా నిర్మూలిద్దాం:  ఎస్సై సాయిబాబు
* అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం

మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముల్కనూర్ ఎస్సై సాయిబాబు అన్నారు.అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా ముల్కనూర్ పోలీస్ శాఖ,వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం,ఐసిడిఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం,అక్రమ రవాణా వల్ల కలిగే నష్టాలపై భీమదేవరపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముల్కనూర్ ఎస్సై సాయిబాబు మాట్లాడుతూ మత్తు వ్యసనాలు నేటి యువతరాన్ని చిత్తు చేస్తుందన్నారు.యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. గంజాయి వంటి మత్తుపార్థాలు మానవుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.యువత మంచి అలవాట్లతో తల్లిదండ్రులు, గురువులు చెప్పిన మాటలు విని చదువుతూ ముందుకు వెళితే చక్కని భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని,డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం కోసం అందరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముల్కనూర్ ఎస్సై సాయిబాబు, వైద్యాధికారి డాక్టర్ రెహమాన్, కేఎల్ఎన్ స్వామి,ఏంస్వరూప, శ్యామల.ఎస్ స్వరూప, జీ.స్వరూప, కే.రాణి, కే.స్వరూప, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *