Neeli Narasimhappa: అనారోగ్యంతో వైసీపీ సీనియర్ నాయకుడు నీలి నరసింహప్ప మృతి

సిరాన్యూస్‌,కంబదూరు
అనారోగ్యంతో వైసీపీ సీనియర్ నాయకుడు నీలి నరసింహప్ప మృతి

వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు నీలి నరసింహప్ప (94) వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈయన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమై ఉప సర్పంచ్ , సర్పంచ్ గా పనిచేసి కంబదూరు ప్రజలకు ఎనలేని సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి మంచి నాయకుడిగా నీలి నరసింహప్ప గుర్తింపు పొందాడు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం , వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనీ స్థాపించడంతో వైసీపీలో చేరాడు. నీలి నరసింహప్ప మృతి పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *