సిరాన్యూస్, బోథ్
కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 109 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116 చొప్పున మొత్తం కోటి రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మీ చెక్కులను గురువారం బోథ్ శాసన సభ్యులు అనిల్ జాధవ్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్ శాసన సభ్యులు అనిల్ జాధవ్ మాట్లాడారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. ఇటు ప్రజలందరికీ ఆపద్భాంధవులుగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బోథ్ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కాంట్రా వాగు నిర్మిస్తానని ఇచ్చిన హామీని వాగు నిర్మించి సకాలంలోనే హామీని నెరవేర్చుకున్నా నని అన్నారు. అదేవిధంగా త్వరలోనే బోథ్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల నూతన భవనాలు కూడా నిర్మిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.