Athram Susheela: ఆదివాసీ మహిళ ఆత్రం సుశీలకు గోల్డెన్ నంది అవార్డు

సిరాన్యూస్‌, బోథ్‌
ఆదివాసీ మహిళ ఆత్రం సుశీలకు గోల్డెన్ నంది అవార్డు

సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు గాను ఆదిలాబాద్‌ జిల్లా  బోథ్‌ మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ ఆత్రం సుశీలకు సుశీలకు గ్లోబల్ ఫౌండేషన్ వారు గోల్డెన్ నంది అవార్డు అందించారు. గురువారం హైదరాబాదు లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో గోల్డెన్ అవార్డ్స్ సెలబ్రేషన్ వారు ఆమెకు నంది అవార్డును అంద‌జేశారు. మారుమూల ప్రాంతాల్లో నిరక్షరాస్యత పరిశుభ్రత కరోనా వ్యాక్సిన్స్ మొక్కల పెంపకం మహిళా సంఘాల నిర్వహణ గర్భిణీల‌ ఆరోగ్యం తదితర అంశాలపై గిరిజనులు అవగాహన కలిగించారు. ఆమె సేవలను గుర్తించి అవార్డు అందించారు. ఫౌండేషన్ వారి అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగింది అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *