గెస్టు లెక్చరర్లను రెన్యూవల్ చేయాలి

 సిరా న్యూస్,హైదరాబాద్;
ఇంటర్, డిగ్రీ కళాశాలలు జూన్ 1 నుండి ప్రారంభం అయ్యాయి. 35శాతం స్టాఫ్ గెస్ట్ లెక్చరర్స్ ను రెన్యువల్ చేయలేదని మీజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.గురువారంఅయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. దీంతో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలకు వెళుతున్నారు. వెంటనే సమస్య పరిష్కారం చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. పర్మినెంట్ లెక్చరర్ లు లేని కళాశాలలు 25ఉన్నాయి. మూడు వేల మంది గెస్ట్ లెక్చరర్ లకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో వారు రోడ్డున పడ్డారు. వాళ్లకు జీత భత్యాలు పెంచాలి. తమ హయంలో అనేక ప్రభుత్వ కళాశాలు మంజూరు చేశాము . విద్యార్థి జీవితంలో ఇంటర్ మీడియట్ చాలా కీలకం. ప్రయివేటు కళాశాలలు వ్యాపార ధోరణితో వున్నాయనిఅన్నారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *