సిరాన్యూస్, ఓదెల
తెలుగు వెలుగు సాహిత్య వేదికలో కవి రవీంద్రాచారికి చోటు
తెలుగు వెలుగు సాహితి వేదిక, జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగంలో కవి రవీంద్రాచారి కి చోటు దక్కింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన యువ కవి, చిత్రకారులు బ్రా హ్మండ్ల పల్లి రవీంద్రా చారిని జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు తెలుగు వెలుగు సాహిత్య వేదిక వ్యవస్థాపకులు పోలోజు రాజ్ కుమార్ తెలిపారు. రవీంద్రా చారి సాహిత్యంలో 22 ఏళ్ల నుండి పలు సంస్థల ద్వారా ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఈసందర్భంగా తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సంస్థ లో ఉన్నత స్థానం కల్పించినందుకు రాజ్ కుమార్ కు రవీంద్రా చారి ధన్యవాదాలు తెలిపారు.