సిరాన్యూస్, బోథ్
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి: మాజీ సర్పంచ్ చెట్లపల్లి సదానందం
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని సొనాల మాజీ సర్పంచ్ చెట్లపల్లి సదానందం అన్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని జెడ్ పి ఎస్ ఎస్ సోనాల పాఠశాలకు పదోన్నతి పై వచ్చిన 14 మంది ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్నిగురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనాల గ్రామం అంటేనే ఉద్యోగ ఉపాధ్యాయులకు పుట్టినిల్లుగా ఉందని , అలాంటి గ్రామానికి పదోన్నతి పై రావడం ద్వారా ఉపాధ్యాయులపై మరింత బరువు బాధ్యతలు, ఉంటాయని, విద్యార్థులను క్రమశిక్షణకు మారుపేరుగా నిలుపుతూ, అన్ని రకాలుగా విద్యార్థులను సర్వతో ముఖాభివృద్ధి పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేశఘుఖ సచిన్, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు .