Thota Agaiah: దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి పీవీ : బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

సిరాన్యూస్‌, రాజన్న సిరిసిల్ల :
దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి పీవీ : బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.
శుక్ర‌వారం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసంద‌ర్బంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడారు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పివి నర్సింహారావు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మన కరీంనగర్ ముద్దుబిడ్డ కావడం గర్వకారణమన్నారు. బహుభాషా కోవిదుడు, జాతీయవాది, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని వారు కొనియాడుతూ భూసంస్కరణలలో భాగంగా పేదలకు తన భూమిని పంచిన గొప్ప సంస్కర్త పీవీ అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, భావితరాలకు స్ఫూర్తిగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ టెక్స్ట్ టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందము కళ చక్రపాణి, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కుంబాల మల్లారెడ్డి, ఎంపీపీ పడిగెల మానస రాజు, మాట్ల, సురేష్ నాయక్, కంచర్ల రవి, శ్రీనివాస్, వెంకటేష్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *