పీవీకి నివాళుల్పించిన మంత్రి పొన్నం

సిరా న్యూస్,హుస్నాబాద్;
హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో మాజీ ప్రధాని, భారత రత్నా పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు , కార్యకర్తలు పాల్గోన్నారు.
మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ముద్దు బిడ్డ , హుస్నాబాద్ నియోజకవర్గ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు. ఈదేశానికి ,ప్రపంచానికి ఎంతోపెరు తెచ్చిన వ్యక్తి. వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్న. వంగర లో జన్మించిన వ్యక్తి పీవీ నరసింహారావు.
పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా భూ సంస్కరణలు , ఆర్థిక సంస్కరణలు తేవడం వల్ల ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది.. వారు చూపిన మార్గదర్శకంలో మేమంతా నడవాలని కోరుకుంటున్న. నవోదయ ,కేంద్రీయ విద్యాలయాల తెచ్చి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చిన వ్యక్తి.. విద్యకు ప్రాధాన్యత తెచ్చిన వ్యక్తి. అయన దేశ ప్రధానిగా చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *