విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

సిరా న్యూస్,మంథని;
మంథని మండలం గుంజపడుగు గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ నల్ల సంతోష్ కుమార్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితుడు సంతోష్ మంథని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. అతను గుంజపడుగు గ్రామంలోని సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా గత మూడు సంవత్సరాలు నుండి విధులు నిర్వహిస్తున్నాడు. తన విధిలో భాగంగా గురువారం అర్ధరాత్రి పనిలో ఉండగా, ఇద్దరు దుండగులు వచ్చి నువ్వు సత్తిరెడ్డి వా అని అడుగుతూ… సంతోష్ కాదని సమాధానం తెలపడంతో అక్కడికి వచ్చిన అగాంతకులు సత్తిరెడ్డి ఎక్కడ ఉన్నాడు నువ్వెందుకు డ్యూటీ కి వచ్చావని అతనిపైన దాడి చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. ఇద్దరు దుండగులు బాధితుడు సెల్ ఫోన్ సైతం తీసుకెళ్లారని బాధితుడు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *