రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఎన్నికలో ఓటమి
ఓటమికి కారకులు ఎవరో అందరికీ బాగా తెలుసు
సిరా న్యూస్,
బద్వేలు;
బద్వేలు తెలుగుదేశం పార్టీ యువనేత సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేష్ కుమార్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఆ పార్టీకి కలిసి వస్తుందా అని ఆ పార్టీ పరిశీలకులు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా బద్వేల్ లో తెలుగుదేశం పార్టీ ప్రతి ఎన్నికల్లోను ఓటమి పాలవుతుంది. పార్టీ ఓటమికి కారకులు ఎవరో అందరికీ బాగా తెలుసు. పార్టీలోని కొన్ని చీడ పురుగులు కోటరీ ఇందుకు ప్రధాన కారణం. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ రితేష్ కుమార్ రెడ్డి ఇప్పటికీ గుర్తించలేకపోవడం విచార కరం. గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి గత ఆరు రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రకు బలమైన కారణం కూడా లేకపోలేదు. రాబోయే ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరకపోతే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావలసిన అవసరం లేదని తాము మరో దారి చూసుకుంటామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బద్వేల్ లో జరిగిన పాదయాత్రలో ప్రజలందరి సమక్షంలో బహిరంగంగా చెప్పడం జరిగింది. నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని సర్వ శక్తులు ఒద్దుతుంది. అందులో భాగమే రితేష్ కుమార్ రెడ్డి పాదయాత్ర. బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీది బలమా? వాప? అనే విషయం ఇప్పటికీ ఆ పార్టీ పరిశీలకులకు రాజకీయ విశ్లేషకులకు అర్థం కావడం లేదు. పార్టీకి ప్రజా బలము ఉంటే పాదయాత్రలు ఎందుకని సూటిగా ప్రశ్ని స్తున్నారు. బద్వేలు తెలుగుదేశం పార్టీలో భజన బృందాల బెడద ఎక్కువగా ఉంది .ఎప్పటినుంచో ఈ బెడద ఉంది. ఇది ఎవరు కూడా కాదనలేని సత్యం. తెలుగుదేశం పార్టీలో వలస పక్షుల దే పెత్తనం. ఇది కూడా ఎవరు కూడా కాదనలేని బహిరంగ రహస్యం. బద్వేలు నియోజక వర్గంలో 20 సంవత్సరాల క్రితం వరకు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఉమ్మడి రాష్ట్ర మంత్రి అపర రాజకీయ చాణక్యుడు బద్వేలు ఎమ్మెల్యేగా ఉన్న బిజీ వేముల వీరారెడ్డి మృతి చెందిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కూతురు విజయమ్మ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే తెలుగుదేశం పార్టీకి చివరి గెలుపు. ఆ తరువాత జరిగిన నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి .ఇలాంటి తరుణంలో భక్తుల అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగుర వేసేందుకు ఆ పార్టీ నాయకులు నాన తంటాలు పడుతున్నారు. బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో తెలుగుదేశం పార్టీ మునుపటి కంటే బలహీనంగా ఉంది. ఈ విషయాన్ని ఆ పార్టీ
పరిశీలకులే చెబుతున్నారు.
బద్వేల్ అసెంబ్లీ రిజర్వు అయిన తరువాత ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మార్చుతూ వస్తుంది. ఇది కూడా పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. ఈ నేపథ్యంలో బద్వేలు అసెంబ్లీలో ఎలాగైనా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని పార్టీ యువనేత సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేష్ కుమార్ రెడ్డి గురువారం నుంచి పాదయాత్ర మొదలు పెట్టాడు. కలసపాడు మండలం గంగాయపాలెం పాదయాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. కడప పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డి జమ్మలమడుగు ఇన్చార్జి భూపేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ఈ పాదయాత్రకు తరలి వచ్చారు. మొదటిరోజు పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని చెప్పాలి. బద్వేలు రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు కూడా పాదయాత్ర చేయలేదు.
బద్వేల్ లో నారా లోకేష్ జరిపిన పాదయాత్ర సమయంలో అద్దెకు తెచ్చిన జనాలే ఎక్కువగా ఉండడం విశేషం అప్పుడు బద్వేలు వైకాపా నాయకులు బహిరంగంగా ఎత్తిచూపారు. ఈ విషయం అప్పట్లో హార్ట్ టాపిక్ గా మా మారింది. కొద్ది రోజులు ఇదే సమస్య ప్రజల మనసుల్లో బాగా నాటుకుంది. ఇప్పుడు రితేష్ కుమార్ రెడ్డి చేస్తున్న పాదయాత్రలపై మొదటి రోజు నుంచి విమర్శలు ఆరోపణలు వెలుగుతున్నాయి పెయిడ్ ఆర్టిస్టుల కారణంగా పాదయాత్ర ఏ రూపం దాలుస్తుందో చూడాలి.
==========================