Kavvampally Satyanarayana: సేవకులుగా ఉండి మంచి పేరు సంపాదించుకోవాలి:  ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ

సిరాన్యూస్, మానకొండూర్:
సేవకులుగా ఉండి మంచి పేరు సంపాదించుకోవాలి:  ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ
* గన్నేరువరం మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య స‌మావేశం

సేవకులుగా ఉండి మంచి పేరు సంపాదించుకోవాలని ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శ‌నివారం మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలం ప్రజా పరిషత్ చివరి సర్వసభ్య స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ హాజర‌య్యారు. చివరి సర్వసభ్య సమావేశం సందర్భంగా ఎంపీపీ , ఎంపీటీసీ లకు ఎమ్మెల్యే ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా జీవితంలో ప్రజల చేత ఎన్నుకోబడి 5 సంవత్సరాలు గ్రామాల్లో సేవలు అందించిన ఎంపీటీసీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఐదు సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం అని అన్నారు. ఎంపీటీసీ ల పదవికాలం ముగిసిన కూడా మంచి చేయాలని సంకల్పం ఉన్నవారు ప్రజా జీవితంలో ఇంకా మరిన్ని సేవలు అందించాలన్నారు. ప్రజా జీవితంలో సంతృప్తి అనేది ఎప్పుడు ఉండదని మీరు ఇంకా గొప్ప లీడర్లుగా ఎదుగలని గెలిచిన ఓడిన నిరుత్సాహపడకుండా ప్రజలకు సేవకులుగా ఉండి మంచి పేరు సంపాదించుకోవాలని కోరారు. అనంతరం మండలంలోని సమస్యలు పరిష్కరించాడానికి గ్రామ గ్రామాన పర్యటిస్తానని మొన్ననే గ్రామ పంచాయితీ రాజ్ అధికారులతో మాట్లాడి నిధుల మంజూరు కోసం మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *