సిరా న్యూస్,మేడ్చల్;
బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్ బీఆర్ ఎస్ మేయర్ సామల బుచ్చి రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి గౌడ్ పై కాంగ్రెస్ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దాంతో ఇద్దరూ మాజీలుగా మారారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 28 మంది కార్పొరేటర్లు వున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కి షాక్ ఇచ్చి కారు దిగి హస్తం గూటికి పదిమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ 22,బీఆర్ఎస్ 4, బీజేపీ కి ఇద్దరు సభ్యులున్నారు. శనివారం నాడు క్యాంపు నుంచి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కు కాంగ్రెస్ కార్పొరేటర్లు చేరుకున్నారు. అవిశ్వాసం అడ్డుకునేందుకు బీఆర్ ఎస్ సర్వశక్తులు వొడ్డింది.
=====