సిరా న్యూస్, భీమదేవరపల్లి
చీకట్ల సురేందర్ గౌడ్ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేత
హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ సూచన మేరకు కొప్పుర్ గ్రామంలో ఇటీవల మరణించిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చీకట్ల సురేందర్ గౌడ్ కుటుంబ సభ్యులను స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పరామర్శించారు. అనంతరం శనివారం కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు.వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భగవంతుడు వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు . ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.