సిరా న్యూస్,
పులివెందుల;
పులివెందులలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేస్తూ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. బయటికి వెళ్లాలంటే అరిచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సి వస్తుందని స్థానికులు అంటున్నారు. తాజాగా కడప పులివెందుల ప్రధాన రహదారిలో నర్సారెడ్డి పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బైకు ఢీకొని ఘటనలో బైక్ లో వెళ్తున్న వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్నామని పులివెందుల వాసులు అంటున్నారు.