సిరా న్యూస్,సైదాపూర్:
జులై 1 నుండి అమల్లోకి కొత్త చట్టం: ఏఎస్ఐ మల్లారెడ్డి
జూలై 1 నుండి కొత్త చట్టం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో సైదాపూర్ మండల కేంద్రంలో పాత బస్టాండ్ ఆవరణలో సైదాపూర్ పోలీస్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను నడపరాదని, మైనర్ పిల్లలకు వాహనాలు నడుపుతూ పట్టుబడితే జరిమానాతో పాటు జైలు శిక్ష గురవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైదాపూర్ ఏఎస్ఐ మల్లారెడ్డి, కానిస్టేబుల్ శంకరయ్య, ఆంజనేయులు, హోంగార్డు సురేష్ ప్రజలు పాల్గొన్నారు.