సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్
ఇర్రి నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని ఆనందంగా గడపాలి
* పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బోనగిరి నరేందర్
* ఘనంగా ఇర్రి నరేందర్ రెడ్డి పదవి విరమణ
* కన్నీటి పర్యంతమైన విద్యార్థులు
పదవి విరమణ అనంతరం శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య గడపాలని పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బోనగిరి నరేందర్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి జూన్ 30వ తేదీన పదవీ విరమణ పొందుతున్న ఇర్రి నరేందర్ రెడ్డి పదవి విరమణ సన్మాన మహోత్సవమును శనివారం పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ అభివృద్ధి కమిటీ, పాఠశాల అభివృద్ధి కమిటి సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, గతంలో ఆయనతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, జిల్లా ప్రముఖులు, మండల ప్రముఖులు హాజరై ప్రసంగించారు. ప్రధాన ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. పదవి విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో, విహారయాత్రలతో, బంధుమిత్రులతో జీవితంను ఆనందంగా కొనసాగించాలని కోరారు. మృదుస్వభావం, అందరితో స్నేహం చేసే వ్యక్తిత్వం, విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం పాటుపడే స్వభావం కలిగిన ఆయన పదవి విరమణ పొందుతున్నారంటే విద్యార్థిని విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. ఆయన పాఠశాలను విడిచి వెళుతుంటే కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు దయానంద్,అబ్దుల్ మజీద్,ఇనుములు స్వామి, వివిధ ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బోనగిరి నరేందర్, ఉపాధ్యాయులు జాడి శ్రీనివాస్, అంజయ్య, శంకర్, శ్రీనివాస్, మారుతి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.