సిరాన్యూస్, ఆదిలాబాద్
రాథోడ్ రమేష్ సేవలు చిరస్మరణీయం : మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే
మాలీల ఉద్యమానికి దివంగత మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అందించిన సేవలు చిరస్మరణీయమని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. ఆదివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల ఫూలే గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి సభ లో పాల్గొని సంఘ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ..
మాలి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాథోడ్ రమేష్ 2001 నుండి మాలి సంఘానికి అండగా ఉంటూ ఉద్యమాలు చేసిన ప్రతిసారి ముందుండి తన వంతు సహాయ సహకారాలను అందిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడపడానికి తోడ్పాటు అందించిన మనసున్న మహానేత రాథోడ్ రమేష్ అని అన్నారు. ఆయన మరణ వార్తను మాలికులస్తులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. రాథోడ్ రమేష్ స్ఫూర్తితో మాలీలు ముందడుగు వేస్తారని మాలీలకు రావాల్సిన ఎస్టి హోదాను పొందే వరకు విశ్రమించబోనని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గూర్ణులే, జిల్లా అధ్యక్షులు విజయ్ వాడగూరే, మాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ అంబేకర్, పట్టణ అధ్యక్షులు శ్రీను ఆచారి, కోశాధికారి భాస్కర్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.