సిరాన్యూస్, ఆదిలాబాద్
ఎమ్మెల్యే పాయల్ శంకర్ను కలిసిన కళాశాల ప్రిన్సిపాల్ పున్నారావు
పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సోమవారం రాష్ట్రంలో 119 నియోజకవర్గ వారీగా తమ తమ శాసనసభ సభ్యులు కి మంత్రులు కి వినతి పత్రాలు ఇవ్వడం లో భాగంగా ఆదిలాబాద్ లో గల కాలేజ్ ల తరుపున సీనియర్ సభ్యులు పున్నారావు అధ్యక్షత న శాసనసభ సభ్యులు పాయల్ శంకర్కు వినతి పత్రం అందజేశారు. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాను అని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పున్న రావు, శ్రవన్ , వికాస్, వినాయకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.