పాల్గోన్న ఎమ్మెల్యే చింతమనేని
సిరా న్యూస్,దెందులూరు;
దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీయార్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. సోమవారం తెల్లవారుఝాము 6గంటల నుంచే దెందులూరు నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో ఫించన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఉదయం 6గంటల నుంచే స్వయంగా పాల్గొని లబ్దిదారుల ఇంటికి వెళ్ళి పెంచిన మొత్తం తో కలిపి ఫించన్లు అందించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, టిడిపి జనసేన బిజెపి నాయకుల సమిష్టి భాగస్వామ్యంతో లబ్ధిదారులకు ఫించన్లు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సారథ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఇది. ఎన్నికల హామీల అమలులో భాగంగా పెంచిన ఫించన్లు నేడు లబ్ధిదారులకు అందించటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్సనం. అర్హత ఉంటే కరడుగట్టిన వైసిపి నాయకుడైన సరే ఫించన్ అందిస్తాం – తప్పుడు సర్టిఫికెట్లతో ఫించన్లు పొందిన అక్రమార్కులపై చర్యలు చేపడతామని తెలిపారు.