సిరా న్యూస్, చిగురుమామిడి
మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన మండల ఎంపీపీ, ఎంపీటీసీలు
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఎంపీపీ కొత్తవినిత శ్రీనివాస్ రెడ్డి,వివిధ గ్రామాల ఎంపీటీసీలు మర్యాదపూర్వకంగా కలిశారు.కొద్ది రోజుల్లో జరిగే జడ్పీటీసీ ఎంపీపీ, ఎంపీటీసీ ల పదవి విరమణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండా గద్దెను మంత్రి ఆవిష్కరిస్తారని తెలిపారు. ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను మంత్రి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ బీసీ రాజిరెడ్డి, ఎంపిటిసి పైసరు జమున రాజేష్, మిట్టపల్లి మల్లేశం, అందే స్వప్న, మెడబోయిన తిరుపతి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.