సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన మాట‌కి క‌ట్టుబ‌డే వ్య‌క్తి

సిరా న్యూస్;

ఇచ్చిన మాట ప్ర‌కార‌మే వృద్ధాప్య‌, వితంతువుల‌కు రూ. 7వేలు, దివ్యాంగుల‌కి రూ. 6వేలు పంపిణీ

– ఉద‌యం 5.45 నిమిషాల‌కే పంపిణీ మొద‌లు పెట్టాం

– మొత్తం 8వేల మందితో ఫించ‌న్ల పంపిణీ

– రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌పున సీఎంకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు

– గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్రాన్ని వైసీపీ స‌ర్వ‌నాశ‌నం చేసింది

– మ‌ళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక్క చంద్ర‌బాబుకే సాధ్యం

– ల‌బ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి ఫించ‌న్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌

గ‌త ఐదేళ్లు త‌రువాత‌… 2024 జులై 1వ‌తేదీ ల‌బ్ధిదారుల క‌ళ్ల‌ల్లో ఆనంద‌బాషాలు చూశాన‌ని… రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ సంతోషం వ్య‌క్తం చేశారు. నెల్లూరు న‌గ‌రంలో ఫించ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని….రాష్ట్ర పుర‌పాల‌క శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌, పార్ల‌మెంట్ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి…ఉద‌యం 5.45 నిమిషాల‌కే ప్రారంభించారు. మొద‌ట‌గా య‌ల‌మ‌వారిదిన్నెలో ఫించ‌న్లు పంపిణీ చేశారు. అనంత‌రం జెండావీధి, క‌పాడిపాళెంల‌లో ల‌బ్ధిదారుల‌కు పెన్ష‌న్లు అంద‌చేశారు. చివ‌ర‌గా వెంక‌టేశ్వ‌ర‌పురంలో టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డితో క‌లిసి పంపిణీ చేశారు. స్వ‌యంగా మంత్రి నారాయ‌ణ‌నే ల‌బ్ధిదారుల ఇంటి వ‌ద్ద‌కే వెళ్లి…ల‌బ్ధిదారుల‌కు ఫించ‌ను న‌గ‌దు అంద‌చేయ‌డంతో ల‌బ్ధిదారులు చాలా సంతోషం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఎన్నిక‌ల‌కు ముందు… ప్ర‌జ‌ల‌కి ఇచ్చిన మాట ప్ర‌కార‌మే…ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించిన 3000 రూపాయలు మొత్తం కలిపి 7000 రూపాయలను అందిస్తున్నార‌ని ల‌బ్ధిదారుల‌కి వారు వివ‌రించారు. చంద్ర‌బాబునాయుడు మాట ఇస్తే ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌ప్ప‌ర‌ని ల‌బ్ధిదారుల‌కి నారాయ‌ణ తెలియ‌జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *