సిరా న్యూస్,
అనంతపురం;
జాబ్ క్యాలెండర్ పేరుతో యువత, నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు.అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్లను విడుదల చేసి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన రెడ్డి మాట తప్పాడని, మడమ తిప్పాడని అన్నారు. 2020నాటికి రాష్ట్రం లో 66,300 ఉద్యోగాలు ఖాళీ ఉండగా 2021-22నాటికి కేవలం 10,143 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారన్నారు. ఈ ఐదేళ్లలో కేవ లం 5వేల జీతంతో గ్రామ వలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెప్పు కుంటున్నాడన్నారు.జగన చేసిన నిర్వాకంవల్ల అనుబంధ సంస్థలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. యువతకు జాబ్ కావాలంటే బాబు రావాలని వచ్చే ఎన్నికల్లో యువత తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్నారు.