సిరా న్యూస్,విశాఖపట్నం;
ఫ్రీ బస్సు పథకంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తా మని, మహిళలకు తీపి కబురు చెబు తామని అన్నారు. విశా ఖ నుంచే ఈ పథకం ప్రారంభమవుతుందని మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు.ప్రస్తుతం ఈ పథకం అమ లవుతోన్న తమిళనా డు, తెలంగాణ, కర్ణాటకల్లో పర్య టించి అధ్యయనం చేస్తామని చెప్పారు.ఈ సందర్భం గా ఆర్టీసీ విలీనం విషయంలో గత ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం వైఎస్ జగన్.. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదని ఆరోపించారు. సిబ్బంది,ఉద్యోగులకు ఇబ్బంది లేకుం డా ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని ఆయన ఉద్ఘాటించా రు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని రామ్ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
====