సిరా న్యూస్,గన్నవరం;
విజయవాడ నుంచి రోడ్డు మార్గన గన్నవరం విమానాశ్రయానికి హోం మంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు. మీడియాతో హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. పెంచిన పెన్షన్ 4000 తో పాటు, ఎన్నికల సమయంలో మూడు నెలలు 3000 కలిపి మొత్తం 7000 రూపాయలు,పెన్షన్లు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన కొనసాగిస్తాంమని అన్నారు.తరువాత ఆమె విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు..