సిరా న్యూస్,హైదరాబాద్;
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్దులు అందోళనకు దిగారు. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని డీఎస్సీ వాయిదా వేసి మెగా డీఎస్సీ ప్రకటించాలని వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ కు మద్దతుగా ఓయూలో విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ముందు బైఠాయించారు. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టలు పెంచాలి. డీఎస్సీ ని వాయిదా వేసి మెగా డీఎస్సీ ని ప్రకటించాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.