కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి ఎఫ్ ఐఆర్ నమోదు

 సిరా న్యూస్,ఢిల్లీ;
సోమవారం నుంచి అమలు లోకి వచ్చిన కొత్త చట్టాల కింద ఢిల్లీలో తొలి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల కింద తొలి ఎఫ్ ఐ ఆర్, ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఓవర్బ్రిడ్జి పక్కనే విక్రయాలు జరిపిన వీధి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *