MLA Anil Jadhav:చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు రావాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

సిరా న్యూస్, బోథ్‌
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు రావాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
* బోథ్‌లో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ

చాకలి ఐలమ్మ స్పూర్తితో రజకులందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని బోథ్‌ శాసనసభ్యులు జాదవ్ అనిల్ పిలుపునిచ్చారు సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యంగా పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె రజాకాలను ఎదిరించి భూమికోసం భుక్తి కోసం పోరాటం చేసిందన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత పోరాట యోధులను పేర్లు బయటకు వచ్చాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చాకలి ఐరన్ ఐలమ్మ జయంతి వర్ధంతిలను, అధికారికంగా నిర్వహించాలని ఆదేశించడంతో ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళ పేర్లు ఉమ్మడి రాష్ట్రంలో బయటకు రాలేదని రాష్ట్రం ఏర్పాటయ్యాక పోరాటయోధుల విగ్రహాలు వారు చేసిన పోరాటాల గురించి బయటకు వచ్చాయన్నారు. రజాకాలకు ముప్పు తిప్పలు పెట్టిన ధీరవనిత ఐలమ్మ అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శమూర్తి అన్నారు. అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేయాలన్న నిర్ణయంతో చాకలి మంగలి వారి షాపులకు ఉచిత విద్యుత్తును ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి దేని అన్నారు. ఇప్పుడు విద్యుత్ బిల్లులను చదివించాలంటూ ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తుందని వాపోయారు. అప్పట్లో బీసీ వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న దృక్పథంతో లక్ష రూపాయల రుణం అందివ్వడం జరిగిందన్నారు. రజకులందరికీ తన వంతుగా భీమా సౌకర్యం కల్పించేందుకు ముందుకు రావడం జరుగుతుందన్నారు. జాబితా తనకు అప్పగిస్తే వారందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వాగుల్లో బట్టలు ఉతికేందుకు వెళ్లి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వారి కుటుంబాలలో భరోసా ఇచ్చేందుకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అంతేగాక మండల కేంద్రంలో రాజకుల కోసం ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కల దత్తు మాట్లాడుతూ రజకులందరికీ ప్రభుత్వ పరంగా రెండు ఎకరాల భూమి అందే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే విన్నవించారు. అన్ని మండల కేంద్రాల్లో చాకలి ఐలమ్మ విగ్రహాల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో జ‌డ్పీటీసీ డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ ఐలమ్మ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, రజక సంఘం జిల్లా కార్యదర్శి కల్లాల శ్రీహరి, మాజీ వార్డు సభ్యులు లింగారెడ్డి, ఎంపీటీసీ మహేందర్, మాజీ ఉపసర్పంచ్, కట్ట పల్లవి భూమేష్, రజక సంఘం మండల అధ్యక్షులు భోజన్న, దత్తన్న లతోపాటు సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *