సిరా న్యూస్,పెంబి
ఎమ్మెల్యే గెలుపు.. మొక్కులు చెల్లించిన పెంబి మండల మహిళలు
నిర్మల్ జిల్లా పెంబి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సల్ల స్వప్నిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆడెళ్లి పోచమ్మ ,మహోర్ ఎల్లమ్మ తల్లి కి మొక్కులు చెల్లించేందుకు ఆదివారం 50 మంది కి పైగా మహిళలు బయలుదేరి వెళ్లారు. గతంలో పెంబి మండల కేంద్ర మహిళలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా వెడ్డ్మ భోజ్జు గెలిస్తే మొక్కులు చెల్లిస్తామని ముడుపులు కట్టారు. ఈ మొక్కులు చెల్లించేందుకు ఆదివారం రోజు తరలివెళ్లారు. ఈ యాత్ర కొరకు సల్ల స్వప్నిల్ రెడ్డి ప్రత్యేకం గా బస్సు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ యాత్రలో మాజీ ఎంపీటీసీ అరె రాజేందర్, తులాల శంకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు