సిరా న్యూస్,కావలి;
నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు లారీని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే క్లీనర్ మృతి చెందగా… పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ కి వెళ్లే దారిని కట్ చేయడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమా అతివేగమా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు.
====