సిరా న్యూస్,సికింద్రాబాద్;
ఉద్యోగాలు కల్పించాలని గాంధీ ఆసుపత్రిలో అమరణ నిరాహార దీక్షకు దిగిన ఓయూ విద్యార్ది మోతిలాల్ నాయక్ తన దీక్షను విరమించారు.
మోతిలాల్ మాట్లాడుతూ నిరుద్యుగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నాం. మా తొమ్మిది రోజుల దీక్షలో ఒక్క ఉద్యోగం పెరగలేదు. అన్న పానియాలు లేకుండా ఆమరణ దీక్ష చేస్తున్నాను. నా ఆరోగ్యం సరిగా లేదు. క్రియాటిన్ లేవల్స్ పెరిగి.. కిడ్నీ, లివర్లు పాడయ్యే పరిస్థితికి వచ్చింది. ఇతర రాష్ట్రల పెత్తనం పోయిన మన బతుకు మారలేదని అన్నారు.
25 నుంచి 35 సంవత్సరాల వయసు యువత ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు కొత్త ప్రభుత్వం రాగానే… తమ డిమాండ్లు పరిష్కరిస్తాం అన్నారు. గ్రూపు1 ను 1:100 చేయాలి. గ్రూపు 2,గ్రూపు 3 ఉద్యోగాలు పెంచాలి. డీఎస్సీని పోస్ట్ పోన్ చేసి .. మెగా డీఎస్సీ రిలీజ్ చేయాలి. రేపటి నుంచి ఉద్యోగాల కోసం తీవ్ర పోరాటం చేస్తాం. 50,000 ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. సీవో లను రిలీజ్ చేసే వరకు ఉద్యమిస్తాం. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని అన్నారు.
========