సిరా న్యూస్,పల్నాడు;
మాచర్ల పట్టణం లోని ఈరోజు తెల్లవారుజామున సమయంలో మాచర్ల మున్సిపల్ కమిషనర్ అద్దె కారు అద్దాలను ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు..నిన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చేతివాటం చూపించాడనే కారణంతో సచివాలయ ఉద్యోగి M.వాలు నాయక్ అనే సచివాలయ ఉద్యోగిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కమిషనర్ సస్పెండ్ చేశారు.ఈ కోణంలో ఏమైనా జరిగిందా లేక రాజకీయ కోణమా,లేదా కారు అద్దెకు పెట్టిన కారు ఓనర్ పై ఉన్న కోపంతో ఇలా జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
=====