Rajarshi Shah: మ‌త్తు ప‌దార్ధాల‌ను నిర్మూలించేందుకు ముందుకు సాగాలి : కలెక్టర్ రాజర్షి షా

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
మ‌త్తు ప‌దార్ధాల‌ను నిర్మూలించేందుకు ముందుకు సాగాలి : కలెక్టర్ రాజర్షి షా
* గంజాయి పండించే వారికి ప్రభుత్వ పథకాలు వర్తించవు:  ఎస్పీ గౌష్ ఆలం
* కళాశాల, పాఠశాలలలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలి

జిల్లాలో పూర్తిగా మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగుతూ వెళ్లాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్‌జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని తన ఛాంబర్లో ఎక్సైజ్, విద్యాశాఖ, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్, రెవెన్యూ, అగ్రికల్చరల్, పోలీస్, వివిధ శాఖల అధికారులతో మత్తు పదార్థాల నివారణ, పండించడం, రవాణా పై తీసుకోవలసిన నిర్ణయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల నందు ఆంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులలో మత్తు పదార్థాలపై, వాటి వల్ల కలుగు అనర్ధాలపై అవగాహనను కల్పించాలని, ప్రతి ఆంటీ డ్రగ్ కమిటీల నందు పోలీసులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఐదుగురికి తక్కువ కాకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలనకై ప్రత్యేకంగా ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, డాన్స్ పోటీలు నిర్వహిస్తూ అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థుల హాస్టల్లో నందు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 35 కేసులను 111 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు 67 మందిపై కేసులు నమోదు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలియజేశారు. అదేవిధంగా ఇప్పటివరకు 42 మంది గంజాయి విక్రయదారులపై బైండోవర్ కేసులను నమోదు చేసినట్లు తెలియజేశారు. గంజాయి వినియోగదారులకు కౌన్సిలింగ్ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. సమాజంలో మరియు విద్యా సంస్థల నందు, మత్తు పదార్థాలపై ఎటువంటి సమాచారం ఉన్న పోలీసు అధికారులకు సూచించాలని తెలిపారు. గ్రామాలను గంజాయి విక్రయదారుల ఆశలో పడి రైతులు గంజాయిని పండించినట్లయితే ప్రభుత్వ పరంగా వచ్చే లబ్ధి చేకూరదని, కేసులలో కూడా నమోదు చేయబడతాయని తెలియజేశారు. ముఖ్యంగా మహారాష్ట్రతో సరిహద్దుతో ఉన్నందున రైలు, రోడ్డు మార్గాలలో గంజాయి విక్రయదారులు ప్రయాణిస్తున్నట్లు, చిన్న మొత్తంలో ఆదిలాబాద్ పట్టణంలోకి గంజాయిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు, వాటిని అడ్డుకు కునేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తూ అడ్డుకుంటుందని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి రైతులకు చైతన్య పరిచయం జరుగుతుందని తెలిపారు. అత్యధికంగా గంజాయి వినియోగిస్తున్న వారికి డి అడిక్షన్ సెంటర్లకు సిఫారసు చేసి వైద్యం అందించాలన్నారు. సమాజంలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి కార్యక్రమాలపై, వారి దినసరి చర్య పై పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు. ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లాలో 124 కేజీల గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కాల్చడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఆర్డీఓ వినోద్ కుమార్, స్త్రీ శిశు, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు సబిత, సునీత కుమారి, డిఇఒ ప్రణిత, డిఐఈఓ రవీందర్, ఎక్సైజ్ సూరింటెండంట్ హిమశ్రీ, వ్యవసాయ అధికారి రమేష్, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *