Ponnam Prabhakar Goud: భారత జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

సిరాన్యూస్‌, చిగురుమామిడి
భారత జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

భారత జాతీయ చిహ్నాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆవిష్కరించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో జ‌డ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయత భావాన్ని ప్రస్ఫుటించే విధంగా భారత జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఐదు సంవత్సరాలు విజయవంతంగా ప్రజాసేవలో ఉన్నందుకు ఎంపీపీ, జెస్పీటీసీ, ఎంపీటీసీ లను అభినందించారు. పదవి విరమణ పొందిన జ‌డ్పీటీసీ , ఎంపీపీ, ఎంపీటీసీలను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి, జెడ్పిటిసి గీకురు రవీందర్, ఆర్డిఓ రాజేశ్వర్, ఎంపీడీవో మధుసూదన్, తహసీల్దార్ నరేందర్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *