సిరా న్యూస్,మేడ్చల్;
రైలు పట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడిని రైలు ఢీకొట్టి, మృతదేహంతో వేలాడుకుంటూ ఘట్కేసర్ రైల్వే స్టేషన్ వరకు తీసుకువచ్చింది. రైల్ కింద వ్యక్తి రైల్ కి వెలాడుకుంటూ ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ కి వచ్చిన ఘటన అక్కడ చూసే వారిని కన్నీటిని తెప్పించింది. బీబీనగర్-ఘటికేసర్ రైల్వేస్టేషన్ మద్య ఓ గుర్తుతెలియని వృద్ధుడు రైలు పట్టాలు దాటుతుండగా వరంగల్ వైపు నుంచి వస్తున్న రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు రైలు ముందుబాగాని కి చిక్కుకొని ఐదు కిలోమీటర్ల మేరకు రైలు లాక్కోంచ్చింది. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటికేసర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలును ఆపి వృద్దుని వెలికి తీశారు. నీలంరంగు చొక్కా, ఆరేంజ్ రంగు లుంగీ, కుడిచేతికి కడెం ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
===