నెల రోజుల్లోగా రాజధాని ప్రాంతంలో పిచ్చి మొక్కలు తొలగించాలి

సిరా న్యూస్;
– సీఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశాలు

రాజధాని అమరావతి పరిధిలో భారీ ఎత్తున పొదలు, పిచ్చి మొక్కల తొలగింపు కోసం సీఆర్డీఏ కార్యాచరణ రూపొందించింది. రాజధాని ప్రాంతంలో నిర్మాణాల వద్ద పేరుకు పోయిన చెత్త, ముళ్ల కంపలను తొలగించే దిశగా కసరత్తు చేపట్టింది. నెల రోజుల్లోగా రాజధాని ప్రాంతంలో పిచ్చి మెుక్కలు, ముళ్ల చెట్లు తొలగించాలని నిర్ణయించింది. అలాగే రైతులకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల వద్ద శుభ్రం చేయాలని సీఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకట్రెండు రోజుల్లో సీఆర్డీఏ టెండర్ ప్రక్రియ చేపట్టనుంది.
========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *