సిరాన్యూస్, జన్నారం
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మొర్రిగూడెం గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందిం చేందుకు వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు.పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలనీ సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు.మొక్కలను నాటడం ద్వారా మనిషి స్వేచ్ఛమైన గాలిని పీల్చుకొని ఆరోగ్యంగా ఉంటాడని పేర్కొన్నారు.ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. భావితరాలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఎంతైన ఉందని పేర్కోన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.