సిరాన్యూస్, ఆదిలాబాద్
మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ధోని జ్యోతి
* జేసీకి వినతి పత్రం అందజేత
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ధోని జ్యోతి అన్నారు.ఆదిలాబాద్ జిల్లా జేసీకి బీజేపీ మహిళ మోర్చా తరపున వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పిన ఆరు గ్యారంటీ లలో మహాలక్ష్మి పథకం 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. లక్ష తో పాటు తులం బంగారం ,ఆడపిల్లలకి స్కూటీలు,4 వేల పెన్షన్ హమీలు వెంటనే నెరవేర్చాలన్నారు. లేని పక్షంలో మహిళల తరుపున ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి ,మహిళా మోర్చా జిల్లా ముఖ్య కార్యదర్శి రాపెల్లి అనిత, మహిళా మోర్చా నాయకురాళ్లు పద్మ గౌడ్, రాణి సరిత, రేఖ, సీతమ్మ, వెంకటలక్ష్మి, కాంత పాల్గొన్నారు.