సిరా న్యూస్,కరీంనగర్;
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదయింది. బిఎన్ఎస్ యాక్టులో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే అయన. మంగళవారం నాడు జిల్లా పరిషత్ సమావేశం లో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జడ్పీ సిఈవో పిర్యాదు చేసారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలొ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2} కేసు నమోదు అయింది. బిఎన్ఎస్ చట్టం అమలులొకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డి పై నమోదు అయింది.
===